News August 8, 2024

PIC OF THE DAY

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం భారత గోల్‌పోస్ట్‌కు అతడు అడ్డుగోడలా నిలబడ్డారు. అయితే శ్రీజేశ్‌కు ఇదే చివరి మ్యాచ్. ఒలింపిక్స్‌ తర్వాత రిటైర్‌ అవుతానని అతడు గతంలోనే ప్రకటించారు. దీంతో ఇవాళ మ్యాచ్ ముగిసిన తర్వాత గోల్‌పోస్ట్‌ పైకి ఎక్కి కూర్చున్న అతడి ఫొటోలు వైరల్‌ అవతున్నాయి. ‘THANK YOU LEGEND’ అంటూ క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

image

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. <>వెబ్‌సైట్‌<<>>లో, మన మిత్ర సర్వీసు(9552300009)లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.

News January 24, 2026

కిషన్ రెడ్డి నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నా: భట్టి

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లు Dy.CM భట్టి అన్నారు. ‘105ఏళ్లుగా సింగరేణి కొనసాగుతోంది. ఆ సంస్థ నిర్ణయాలు మంత్రి వద్దకు రావు. కోల్ ఇండియా 2018లో టెండర్ డాక్యుమెంట్ పంపింది. సైట్ విజిట్ తప్పనిసరి అని CMPDI డాక్యుమెంట్‌లో ఉంది. ఆ సమయంలో మా ప్రభుత్వం లేదు. 2021, 2023లో కోల్ ఇండియా, NMDC పంపిన డాక్యుమెంట్లలోనూ సైట్ విజిట్ అని ఉంది’ అని స్పష్టం చేశారు.

News January 24, 2026

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.