News October 16, 2025
PIC OF THE DAY

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
Similar News
News October 16, 2025
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు.. కొత్త అప్లికేషన్ల స్వీకరణ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గ్రామగ్రామాన జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఏయే పథకాలకు అప్లికేషన్లు స్వీకరించాలనే అంశంపై రెండు రోజుల్లో సీఎస్ అధ్యక్షతన సమావేశమై వివరాలు వెల్లడించనున్నారు.
News October 16, 2025
కనికరం లేని దైవమే ‘భూతం’

<<17901211>>భూతం<<>> అంటే చెడు శక్తులు కాదన్న విషయం మనం తెలుసుకున్నాం. కానీ దైవానికి, భూతానికి మధ్య తేడా ఉంటుంది. దేవతలు దేశాన్ని రక్షిస్తూ, దయ, కనికరం చూపిస్తారు. వీరి వద్ద తప్పుకు విముక్తి ఉంటుంది. కానీ భూతాలు గ్రామాన్ని మాత్రమే చూసుకునే స్థానిక దైవాలు. వీటికి కనికరం ఉండదు. ఓ వ్యక్తి తప్పు చేస్తే వెంటనే శిక్షను విధిస్తాయి. అందుకే ఈ ఉగ్ర శక్తిని గ్రామస్థులు ఎక్కువగా నమ్ముతారు. భయపడతారు. <<-se>>#Kanthara<<>>
News October 16, 2025
రంజీ ట్రోఫీ.. 40 ఏళ్ల వయసులో రికార్డు

రంజీ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా J&K కెప్టెన్ పరాస్ డోగ్రా(40 ఏళ్లు) నిలిచారు. ముంబైతో మ్యాచులో ఆయన 32వ సెంచరీ నమోదు చేశారు. 42 సెంచరీలతో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రంజీల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో జాఫర్ (12,038) తర్వాత డోగ్రా(9,500) రెండో స్థానంలో ఉన్నారు. 2001-02లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన డోగ్రా గతంలో HP, పుదుచ్చేరి జట్లకు ఆడారు.