News July 17, 2024
ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?
Similar News
News February 23, 2026
కరీంనగర్ పోలీస్ దళంలోకి రెండు కొత్త డాగ్స్

నేర పరిశోధనను మరింత వేగవంతం చేసేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ దళంలోకి రెండు నూతన పోలీస్ డాగ్స్ చేరాయి. HYD లోని ఐ.ఐ.టి.ఏ (IITA) కేంద్రంలో 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న రోలెక్స్ (ట్రాకర్), మాక్స్ (స్నిఫర్) పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి. వీటి రాకతో జిల్లాలో భద్రత వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు.
News February 23, 2026
ఆలస్యంగా నిద్రపోతే..

ఆరోగ్యంగా ఉండేందుకు డైట్, వ్యాయామంతోపాటు నిద్ర కూడా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే టైమ్లో నిద్రపోని, 11PM వరకు మేల్కొనే వారు బరువు తగ్గడంలో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ‘10.30PM తర్వాత జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ సమయంలో మేల్కొంటే శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. ఇది బరువుపై ప్రభావం చూపుతుంది. అజీర్ణం, ఉబ్బరం సమస్యలొస్తాయి’ అని హెచ్చరిస్తున్నారు.
News February 23, 2026
గేమ్స్ వద్దు.. ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

US సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఏ దేశమైనా గేమ్స్ ఆడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా USను దశాబ్దాలుగా టారిఫ్స్తో పీడించిన దేశాలకు గతంలో కంటే ఎక్కువ టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికాతో ట్రేడ్ డీల్ను EU హోల్డ్ చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


