News July 17, 2024
ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?
Similar News
News February 11, 2026
ప్రీ స్కూల్ అటెండెన్స్లో మన్యం జిల్లాకు అగ్రస్థానం

ప్రీ స్కూల్ అటెండెన్స్లో పార్వతీపురం మన్యం జిల్లా పనితీరు అద్భుతమని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.సూర్యకుమారి కొనియాడారు. 95% అటెండెన్స్తో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని ఆమె పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ప్రభాకర రెడ్డిని మంగళవారం అభినందించారు. స్టంటింగ్, అండర్ వెయిట్, ఫేస్టింగ్ సూచికల్లో కూడా మెరుగుదల కనిపించినట్లు చెప్పారు.
News February 11, 2026
టుడే టాప్ స్టోరీస్

* ఢిల్లీలో CM CBN బిజీబిజీ.. ప్రాజెక్టులు, నిధులకై కేంద్రమంత్రులతో భేటీ
* రేపటి నుంచి AP బడ్జెట్ సమావేశాలు.. హాజరవనున్న జగన్
* రేపే TG మున్సిపల్ పోలింగ్.. కొడంగల్లో ఓటు వేయనున్న CM రేవంత్
* తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
* మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఆదాయం రూ.12.64 కోట్లు
* లోక్సభ స్పీకర్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీస్
News February 11, 2026
అనుదీప్ మళ్లీ అలరించేనా?

కామెడీ సినిమాల్లో ‘జాతిరత్నాలు’ ట్రెండ్ సెట్ చేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ అనుదీప్ నుంచి ఆ స్థాయి సినిమా రాలేదు. ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన ‘ఫంకీ’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ మూవీతో అభిమానులను అలరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయని చెబుతున్న ఈ డైరెక్టర్ ఫంకీతో అలరిస్తారో లేదో చూడాలి.


