News July 17, 2024
ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?
Similar News
News February 8, 2026
T20 WC: అఫ్గాన్ను ఓడించిన న్యూజిలాండ్

చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. సీఫర్ట్ 65, ఫిలిప్స్ 42, చాప్మాన్ 28, మిచెల్ 25*, శాంట్నర్ 17* రన్స్ చేశారు. ఫిన్ అలెన్ (1), రచిన్ రవీంద్ర (0) నిరాశపరిచారు. టీ20 WC చరిత్రలో న్యూజిలాండ్కు ఇదే హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ కావడం గమనార్హం.
News February 8, 2026
జూన్ 2న కవిత కొత్త పార్టీ ఆవిర్భావం

BRS నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ MLC కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పార్టీ పేరు, జెండా, అజెండాను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను ప్రారంభించింది. పార్టీ నిర్మాణంపై కసరత్తు ముమ్మరం చేసిన కవిత కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
News February 8, 2026
రేవంత్ అత్యంత దరిద్రపు సీఎం: KTR

TG: చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక CMగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ఆయన అత్యంత దరిద్రపు ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లుగా KCRను తిట్టడం తప్పించి చేసిందేమీ లేదన్నారు. రోజూ రూ.వందల కోట్లు దోచుకోవడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడేళ్ల దాకా దొరకరని, వారికి బుద్ధి చెప్పాలని తాండూరు సభలో పిలుపునిచ్చారు.


