News July 17, 2024
ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?
Similar News
News March 2, 2026
రష్యా చమురు వైపు మళ్లీ భారత్ చూపు

హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో రష్యా చమురు దిగుమతిపై భారత్ మళ్లీ దృష్టి సారించినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ‘తన జలాల్లో డాక్ చేసిన కార్గోషిప్లలోని రష్యా చమురు కొనుగోలుకు భారత్ ఆలోచన చేస్తోంది. ఈ ట్యాంకర్లలో 9.5M బ్యారెళ్ల చమురు ఉంది. భారత ఆయిల్ కంపెనీలు దీనిపై ప్రభుత్వంతో చర్చించాయి’ అని తెలిపింది. US ఒత్తిడితో రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గించడం తెలిసిందే.
News March 2, 2026
ఖమేనీ చనిపోతే భారత్లో ఆందోళనలు ఎందుకు?

ముస్లింలలో సున్నీ, షియా శాఖలు ఉంటాయి. ప్రపంచంలో మొత్తం ముస్లిం జనాభాలో షియాలు 10-15% ఉంటారు. అందులో ఎక్కువ మంది ఇరాన్లోనే నివసిస్తున్నారు. ‘అయతుల్లా’ అనేది మత గురువు హోదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు ‘అయతుల్లా’ను ఆధ్యాత్మిక గురువుగా, మతపెద్దగా భావిస్తారు. ఇజ్రాయెల్-అమెరికా కలిసి అయతుల్లా అలీ హొస్సేనీ ఖమేనీని చంపడంతో ఆ దేశాలకు వ్యతిరేకంగా షియాలు <<19279240>>నిరసనలు<<>> చేస్తున్నారు.
News March 2, 2026
గల్ఫ్లో గురితప్పిన అమెరికా ‘రక్షణ కవచం’?

తమ గడ్డపై ఉన్న US బేస్లు రక్షణ కంటే ముప్పుగానే మారుతున్నాయనే చర్చ గల్ఫ్ దేశాల్లో మొదలైంది. తాజాగా ఇరాన్ జరిపిన దాడులను US అడ్డుకోలేకపోగా.. కీలక స్థావరాలు ఇరాన్ అటాక్స్కు లక్ష్యంగా మారాయి. UAE, కువైట్, ఖతర్లపై దాడులే దీనికి నిదర్శనం. దీంతో తమ భూభాగాలను ఇతరుల ప్రతీకార వేదికలుగా మార్చొద్దని UAE పరోక్షంగా అమెరికాను కోరడం గమనార్హం.


