News July 17, 2024

ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

image

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?

Similar News

News February 3, 2026

అమరావతికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలి: SA రిపోర్టు

image

AP: అమరావతి రాజధానికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలని తాజాగా విడుదలైన సోషల్ ఆడిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద స్కేల్ ప్రాజెక్టుపై రాజకీయాలు లేదా ఇతర ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది స్థానికుల జీవనోపాధిపై దుష్ప్రభావం చూపుతుంది. వారి జీవితాలను దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలంది. రోజువారీ కూలీపై ఆధారపడి ఉన్న భూమిలేని వారిని ఆదుకోవాలని సూచించింది.

News February 3, 2026

Airtel: ఉచిత AI ఆఫర్ ఇక ఉండదు

image

ప్రముఖ టెలికం సంస్థ Airtel తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఇస్తున్న ఉచిత ఏఐ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసే వినియోగదారులకు Perplexity AI ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉండదని కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వర్తిస్తుందని ముందుగానే తెలిపింది. అయితే ఇప్పటికే ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ పేర్కొంది.

News February 3, 2026

లోక్‌సభలో గందరగోళం.. వాయిదా

image

అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్‌పై పార్లమెంటులో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ముందు ఉన్న టేబుల్ ఎక్కి విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాపైకి పేపర్లు విసిరారు. దీంతో ఆయన సభను గంటపాటు వాయిదా వేశారు. అటు పార్లమెంటు బయట కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.