News July 17, 2024

ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చావమ్మా!

image

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన అమల తన 3ఏళ్ల కుమారుడు ఆదిత్యకు కాలేయ దానం చేశారు. చిన్నారి పుట్టుక నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా ఉస్మానియా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆదిత్యకు కాలేయ మార్పిడి చేశారు. సర్జరీ అనంతరం ఆ తల్లి తన కుమారుడికి భోజనం తినిపించి మురిసిపోయారు. తద్వారా ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చారు. మీరేమంటారు?

Similar News

News March 15, 2026

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న ఏలూరు ఎంపీ!

image

HYD మొయినాబాద్‌లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో శనివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో పార్టీలోని ఒకరు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 9 మందిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రోహిత్ సహా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

News March 15, 2026

వారిద్దరినీ వదులుకొని KKR తప్పు చేసింది: కుంబ్లే

image

KKR 2024లో మూడోసారి IPL ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లది కీలక పాత్ర అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చెప్పారు. అలాంటి వాళ్లను వదులుకోవడం కోల్‌కతా చేసిన మిస్టేక్ అని అభిప్రాయపడ్డారు. కీలక ప్లేయర్లను తమ వద్దే ఉంచుకోవడం ఎంత ముఖ్యమన్నది జట్టు అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే టైటిల్‌ పోటీలో నిలవలేదని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం శ్రేయస్ PBKS, సాల్ట్ RCBలో చేరిన విషయం తెలిసిందే.

News March 15, 2026

నావిక్‌కు అంతరాయం

image

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.