News March 22, 2024
మనిషికి పంది కిడ్నీ మార్పిడి

ఓ మనిషికి వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్లో జరిగింది. కిడ్నీలు ఫెయిలైన 62 ఏళ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. కాగా ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది ఒక శుభవార్తేనని వైద్యులు అంటున్నారు.
Similar News
News October 19, 2025
రాశులను ఎలా నిర్ణయిస్తారు?

వ్యక్తి పుట్టిన సమయం, ప్రదేశం ఆధారంగా రాశులను నిర్ణయిస్తారు. ఆ జన్మించిన సమయానికి ఆకాశంలో చంద్రుడు ఉన్న రాశినే వారి జన్మ రాశిగా పరిగణిస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది వారి జన్మ నక్షత్రం అవుతుంది. పుట్టిన సమయానికి తూర్పున ఉదయించే రాశిని జన్మ లగ్నంగా వ్యవహరిస్తారు. జన్మ రాశి, నక్షత్రాల ఆధారంగానే జాతక ఫలితాలు నిర్ణయమవుతాయి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను జ్యోతిషం <<-se_10008>>కేటగిరీకి<<>> వెళ్లి చూడొచ్చు.
News October 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 40

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. ఎవరి అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు?
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ఏమంటారు?
4. ‘హనుమాన్ చాలీసా’ను రచించిన భక్తుడు ఎవరు?
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 19, 2025
NIEPMDలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీ (NIEPMD) 7 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, సైకోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.590. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్సైట్: https://niepmd.nic.in/