News March 22, 2024
మనిషికి పంది కిడ్నీ మార్పిడి

ఓ మనిషికి వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్లో జరిగింది. కిడ్నీలు ఫెయిలైన 62 ఏళ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. కాగా ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది ఒక శుభవార్తేనని వైద్యులు అంటున్నారు.
Similar News
News November 17, 2025
నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్ల నుంచి పై ఫొటోను డిజిటల్గా క్రాప్ చేశారు. బ్లూ కలర్లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్లో ఉన్నవి వలయాల నీడలు.
News November 16, 2025
ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.
News November 16, 2025
లైటింగ్ పెంచడంతోనే పేలుడు!

J&K నౌగామ్ పోలీస్ స్టేషన్లో జరిగిన <<18295101>>పేలుడుకు<<>> అధిక లైటింగే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో ద్రవరూప రసాయనాలు కూడా ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ బృందాలు లైటింగ్ పెంచాయి. దీంతో వెలువడిన వేడి లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చిన పొగలు ఆ రసాయనంతో కలిసి పేలుడు జరిగి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.


