News March 22, 2024

మనిషికి పంది కిడ్నీ మార్పిడి

image

ఓ మనిషికి వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగింది. కిడ్నీలు ఫెయిలైన 62 ఏళ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. కాగా ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది ఒక శుభవార్తేనని వైద్యులు అంటున్నారు.

Similar News

News November 17, 2025

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

News November 17, 2025

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

News November 17, 2025

షేక్ హసీనాకు మరణశిక్ష

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.