News October 15, 2024
పవన్ కళ్యాణ్ కామెంట్స్ తొలగించాలని పిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిల్ దాఖలైంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వులు కలిశాయని వ్యాఖ్యానించారని, వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని లాయర్ రామారావు పిల్ వేశారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ (నిషేధ) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నేడు ఈ పిల్ విచారణకు రానుంది.
Similar News
News October 15, 2024
ఈనెల 22న తరగతులను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య
TG: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్తో కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలనే నిర్ణయాన్ని యాజమాన్యాలు ఉపసంహరించుకోవాలని కోరారు.
News October 15, 2024
‘నోబెల్’ను తెచ్చిపెట్టిన సైకిల్!
భారతరత్న అమర్త్య సేన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ‘నోబెల్’ ట్విటర్లో పంచుకుంది. సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో అవార్డు పొందడంలో ఆయన సైకిల్ కీలక పాత్ర పోషించిందని తెలిపింది. ‘మగ, ఆడపిల్లల మధ్య తేడాలపై పరిశోధన చేసేందుకు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్పైనే తిరిగేవారు. పిల్లల బరువును తానే స్వయంగా కొలిచేవారు. మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో ఆయన సహాయం చేశారు’ అని నోబెల్ పేర్కొంది.
News October 15, 2024
నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల తేదీల ప్రకటన
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇవాళ మ.3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్మీట్ నిర్వహించి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.