News October 8, 2024
డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్స్టర్ ఓం ప్రకాశ్ నిర్వహించిన డీజే పార్టీలో పలువురు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. పిశాచి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి ప్రయాగ మార్టిన్, మంజుమ్మల్ బాయ్స్ నటుడు శ్రీనాథ్ భాసి పార్టీలో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Similar News
News February 7, 2026
డెలివరీ తర్వాత కాళ్ల వాపులు తగ్గట్లేదా?

డెలివరీ తర్వాత మహిళల్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిల్లో ఒకటి కాళ్లవాపు. ప్రెగ్నెన్సీలో కాళ్లవాపు సహజమే కానీ డెలివరీ తర్వాత కూడా అలా ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. కాళ్లు ఎత్తులో పెట్టుకొని పడుకోవడం, మసాజ్ చేయడం, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రొటీన్లు, పొటాషియం ఉన్న ఆహారాలు డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News February 7, 2026
మసీదుపై దాడి.. అసలేంటీ ఇస్లామిక్ స్టేట్?

పాక్లో చేసిన <<19073745>>దాడి<<>>తో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ISIS) పేరు చర్చనీయాంశమవుతోంది. 2014-2017 మధ్య సిరియా, ఇరాక్లో అతి దారుణమైన దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిందీ సంస్థ. కానీ US దాడులు, దాని చీఫ్ అబు బకర్ బగ్దాదీ హతమవడంతో పతనమైంది. ప్రస్తుతం సిరియా, ఇరాక్, అఫ్గాన్, పాక్తోపాటు పలు దేశాల్లో ఉనికిలో ఉంది. దీని నాయకత్వం రహస్యంగా ఉంది. తరచూ దాడులు చేస్తోంది. ఇటీవల <<18561798>>సిడ్నీలో దాడి<<>> చేసింది కూడా IS సానుభూతిపరులే.
News February 7, 2026
వెండితెరపై తండ్రీకూతుళ్ల జోరు!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ తండ్రీకొడుకుల కాంబోలు చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 2026లో తండ్రీకూతుళ్ల జోరు సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో నిర్మాతగా సత్తా చాటగా గుణశేఖర్ కుమార్తె నీలిమ ‘యుఫోరియా’ను నిర్మించారు. రవితేజ డాటర్ మోక్షద ‘ఇరుముడి’ నిర్మాణ బాధ్యతలు చూస్తుంటే నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ‘సీతా పయనం’ను తెరకెక్కిస్తున్నారు.


