News May 24, 2024
పీకే బీజేపీ ఏజెంట్: తేజస్వీ యాదవ్

ప్రశాంత్ కిశోర్ బీజేపీ కోసం పనిచేస్తూ, ఆ పార్టీ సిద్ధాంతాలను అనుకరిస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి బీజేపీ పీకేను రంగంలోకి దింపిందన్నారు. తమ వ్యూహంలో భాగంగానే కేంద్రం అతడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. పీకే బీజేపీ ఏజెంట్ అన్న తేజస్వీ.. అతను ఏ పార్టీలో ఉంటే అది నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు.
Similar News
News October 21, 2025
అమెరికన్ చెస్ గ్రాండ్మాస్టర్ కన్నుమూత

అమెరికన్ చెస్ గ్రాండ్మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ(29) కన్నుమూశారు. ‘టాలెంటెడ్ చెస్ ప్లేయర్, ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో ప్రియమైన సభ్యుడు తుదిశ్వాస విడిచారు’ అని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. 18 ఏళ్లకే డానియెల్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్షిప్గా నిలిచారు.
News October 21, 2025
గ్రామాల రక్షణకు మహిళల గ్రీన్ ఆర్మీ

UP వారణాసి గ్రామాల్లో పరిశుభ్రత, చైతన్యం కోసం మహిళలతో ఏర్పడిన గ్రీన్ఆర్మీ ఎన్నో సాంఘిక సంస్కరణలు చేస్తోంది. 2015లో రవిమిశ్ర అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆర్మీలో 2,200 మంది మహిళలు ఉన్నారు. వీరు గృహహింస, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరిస్తున్నారు. చెప్పులు, నారసంచుల తయారీతో ఉపాధి కూడా పొందుతున్నారు. వీరి కృషిని గుర్తించి PM మోదీ కూడా అభినందించారు.
News October 21, 2025
56 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: చిత్తూరు DHMO 56 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, MBBS, CA, Mcom, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://chittoor.ap.gov.in/