News April 8, 2024

పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లం: బొత్స

image

AP: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గర పీకే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించారు. మేనేజ్ మెంట్ తప్ప ప్రశాంత్ కిశోర్ చేసేదేమీ లేదని దుయ్యబట్టారు. బిహార్ నుంచి PKను తరిమికొట్టారని అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

Similar News

News October 9, 2024

పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్?

image

పాకిస్థాన్‌ టీమ్‌కు ICC బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. UAE, శ్రీలంక, సౌతాఫ్రికాల్లో ఎక్కడో ఓ చోట టోర్నీ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. లేదంటే హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచులు పాక్ ఆవల నిర్వహించాలని భావిస్తున్నట్లు టాక్. BCCI అంగీకరిస్తే పాక్‌లోనే టోర్నీ ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News October 9, 2024

ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం

image

AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

News October 9, 2024

టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు

image

AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.