News April 8, 2024

పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లం: బొత్స

image

AP: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గర పీకే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించారు. మేనేజ్ మెంట్ తప్ప ప్రశాంత్ కిశోర్ చేసేదేమీ లేదని దుయ్యబట్టారు. బిహార్ నుంచి PKను తరిమికొట్టారని అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

Similar News

News December 1, 2025

కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

image

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.

News December 1, 2025

14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 1, 2025

కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

image

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.