News March 11, 2025
R5 జోన్ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.
Similar News
News March 12, 2025
APPLY: అకౌంట్లలోకి రూ.6,000

రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ FEB 24న విడుదల చేశారు.
వెబ్సైట్: <
News March 12, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవ్వగా తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన చేయనుంది.
News March 12, 2025
లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం!

ఇళ్లు, ఆఫీస్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్లో నిత్యం లిఫ్ట్లు వాడుతుంటాం. కానీ ఎలివేటర్ల నిర్వహణ లోపం వల్ల ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తతో వీటిని నివారించుకోవచ్చు. మీరు బటన్ నొక్కగానే లిఫ్ట్ మీ ఫ్లోర్కు వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకున్నా డోర్లు తెరుచుకుంటాయి. చూడకుండా అందులోకి ఎక్కాలని చూస్తే కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.