News February 17, 2025

ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

image

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.

Similar News

News February 10, 2026

ఢిల్లీలో CBN.. అమరావతి, పోలవరం నిధులపై ఫోకస్!

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్‌తో సహా పలువురితో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి అమరావతి చట్టబద్ధత, పోలవరం ప్రాజెక్టు, పథకాలు, ఇతర అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై వారితో చర్చించనున్నారు. వరుస భేటీల అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి అమరావతికి బయల్దేరుతారు.

News February 10, 2026

ఉల్లిని నమ్మి, తల్లిని నమ్మి చెడినవాడు లేడు

image

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది, ఎటువంటి హాని జరగదు. అలాగే తల్లి తన పిల్లలకు ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటుంది. తల్లి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. తల్లిని నమ్ముకుని, ఆమె మాట విని నడుచుకుంటే జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఎదురవవు. అందుకే ఉల్లిని, తల్లిని నమ్మిన వారు ఎప్పటికీ నష్టపోరని ఈ సామెత వివరిస్తుంది.

News February 10, 2026

ఉపవాసం: ఈ నియమాలు మీకు తెలుసా?

image

పగలు, రాత్రి భోజనం చేయకపోవడాన్ని ‘ఉపవాసం’ అంటారు. మధ్యాహ్నమే భుజించడం ‘ఏకభుక్తం’. రాత్రి మాత్రమే తినడం ‘నక్తం’. ఉపవాస సమయంలో పగటి నిద్ర, తాంబూలం, క్రోధం, కంటనీరు వంటివి వ్రత భంగాన్ని కలిగిస్తాయి. గురువు ఆజ్ఞ, ఔషధ సేవ, జలం తీసుకోవడం నిషిద్ధం కాదు. ఏ దేవత కోసం వ్రతం చేస్తున్నామో ఆ దైవ మంత్రాన్ని జపిస్తూ, కథా శ్రవణం, పూజలతో రోజంతా గడపాలి. పరాన్న భోజనం విడిచి, మనస్సును పూర్తిగా దైవచింతనలో ఉంచాలి.