News November 19, 2024
రాష్ట్ర రోడ్లపైనా టోల్ వసూలు యోచన: సీఎం చంద్రబాబు

AP: హైవేల తరహాలో రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు విధింపునకు యోచిస్తున్నట్లు CM చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనిపై MLAల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని అందరూ మద్దతు పలికారు. టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని CM అన్నారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
‘ఘన’మైన శ్రీకృష్ణదేవరాయలవారు.. అందుకే ట్యాంక్ బండ్పై ఆయనకు గౌరవం

తెలుగువారికి <<18954194>>రాజంటే గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలే.<<>> 1509లో సింహాసనమెక్కి 20ఏళ్లు పాలించారు. ఆయన రజనీతిజ్ఞత, కండ, మేథోబలంతో 1510లో కోవిల్కొండ యుద్ధంలో బహమనీ సుల్తాన్ను ఓడించారు. ఆముక్తమాల్యదతో మహా పండితుడయ్యారు. తెనాలి రామకృష్ణుడు ఈయన ఆస్థానకవే. ఈయన పాలనలో రత్నవైడూర్యలు రాశులుగా పోసి అమ్మేవారని, ప్రజలంతా సుభిక్షంగా బతికారని చెబుతారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంలా మార్చిందీ ఈ మహాచక్రవర్తే.
News January 25, 2026
కళ్లు ఇలా ఉంటే కిడ్నీ సమస్యలు!

కళ్లు ఎర్రబడటం, అలసట, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లూ, ఎల్లో రంగులను సరిగ్గా గుర్తించలేవు. డబుల్, బ్లర్ విజన్, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు కలుగుతాయి. కళ్లు పొడిబారడం, దురద సమస్యలు ఎదురవుతాయి. యూరిన్లో ప్రొటీన్ లీకై కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి ఉబ్బినట్టు కనిపిస్తాయి. యూరిన్లో నురుగు లేదా బుడగలు ఉన్నా కిడ్నీల పనితీరు సరిగ్గా లేదని గుర్తించాలి.
News January 25, 2026
విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.


