News April 5, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల్లో ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. మొత్తం 4,61,806 మంది ఓటర్లను గుర్తించగా.. వీరిలో పురుషులు 2.87 లక్షల మంది, మహిళలు 1.74 లక్షల మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 83,606 మంది, అత్యల్పంగా సిద్దిపేటలో 4,671 మంది ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.

Similar News

News November 20, 2025

ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.

News November 20, 2025

రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

image

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్‌‌‌ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.

News November 20, 2025

సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసా?

image

సావిత్రి తన వాక్చాతుర్యంతో భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకుంది. యముడు తన భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తుంటే అడ్డుపడింది. ధర్మబద్ధమైన సంభాషణలతో యముడిని మెప్పించి, 3 వరాలు పొందింది. మూడో వరంగా సత్యవంతుడి ద్వారా 100 మంది పుత్రులు కావాలని కోరింది. యముడు వరమివ్వగానే ‘నా భర్త మీ వెంట ఉంటే, నాకు పుత్రులు ఎలా కలుగుతారు?’ అని ప్రశ్నించింది. భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడి చేతే భర్తను బతికించుకుంది.