News February 19, 2025

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయండి.

Similar News

News February 21, 2025

‘విదేశీ వైద్యవిద్యకు NEET-UG అర్హత’ నిబంధన సరైనదే: సుప్రీం

image

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి ముందుగా నీట్ యూజీలో అర్హత సాధించాలన్న నిబంధన సరైనదేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిబంధనను మార్చాలంటూ పలువురు విద్యార్థులు చేసిన విజ్ఞప్తులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఆ నిబంధనను అమలు చేసే అధికారం MCIకి ఉందని స్పష్టం చేసింది.

News February 21, 2025

సాత్విక్ సాయిరాజ్‌ తండ్రి గుండెపోటుతో మృతి

image

AP: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో విషాదం నెలకొంది. కొడుకుకు ‘ఖేల్‌రత్న’ చూసి మురిసిపోవాల్సిన తండ్రి కాశీ విశ్వనాథం(65) గుండెపోటుతో చనిపోయారు. ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం కోసం నిన్న అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఆయన కుప్పకూలారు. USలో ఉన్న సాత్విక్ సోదరుడు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. 2023కు గాను సాత్విక్‌ ఖేల్‌రత్నకు ఎంపికవగా పలుకారణాలతో అప్పుడు తీసుకోలేదు.

News February 21, 2025

రకుల్ సినిమాకు వన్ ప్లస్ వన్ ఆఫర్!

image

రకుల్ ప్రీత్ సింగ్, భూమీ పెడ్నేకర్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మేరే హస్బెండ్‌కీ బీవీ’. ఈరోజు విడుదల కానున్న ఈ సినిమాకు మేకర్స్ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించారు. ‘ఛావా’తో పోటీని తట్టుకునేందుకు నిర్మాత ఈ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అయితే అర్జున్ కపూర్‌కు పెద్దగా ఇమేజ్ లేకపోవడం, రొటీన్ స్టోరీ లైన్, ఛావా దూకుడు మూవీకి మైనస్ కావొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

error: Content is protected !!