News January 21, 2025

PM అవార్డ్స్ కోసం ప్రతిపాదనలు పంపండి: ప్రకాశం కలెక్టర్

image

పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2022 ఏప్రిల్ నెల నుంచి 2024 డిసెంబరు నెలాఖరు వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 23, 2026

ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

image

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.

News February 23, 2026

వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు అంతా ప్రాముఖ్యత

image

రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక్కటి. ఈ ప్రాజెక్టు కోసం కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఫిడర్ కెనాల్ మరమ్మత్తులకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 25న రూ.456కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు మండలాలు సస్యశ్యామలం అవుతాయి.

News February 23, 2026

ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

image

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.