News January 22, 2026
PM తర్వాత గంభీర్దే టఫ్ జాబ్: శశి థరూర్

నాగ్పూర్లో హెడ్ కోచ్ గంభీర్ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.
Similar News
News February 14, 2026
గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

నేటి కాలంలో గుడ్ కొలెస్ట్రాల్ (HDL) తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతోంది. దీంతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమేగా-3 ఉండే చేపలు, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్నట్, బ్లూబెర్రీ, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. స్మోకింగ్ మానేయాలి. రోజుకు 7-8 గం. నిద్రపోవాలి.
News February 14, 2026
పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.
News February 14, 2026
ఓటుకు రూ.70వేలు.. 200+ ఓట్ల మెజారిటీతో గెలుపు

TG: రంగారెడ్డి(D) <<19125637>>మొయినాబాద్<<>> మున్సిపాలిటీలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటుకు రూ.70వేలు, 25kgs బియ్యం పంచినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న వెలువడిన ఫలితాల్లో ఆయన 200కి పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ప్రాంతం రియల్టర్లకు గోల్డ్ మైన్గా మారడంతోనే గెలుపు కోసం రూ.7కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థి కావడంతో ప్రధాన పార్టీల నుంచి ఆయనకు భారీ ఆఫర్ రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.


