News November 29, 2024

PM వెళ్లి బిర్యానీ తినొచ్చు కానీ టీమ్ ఇండియా వెళ్లొద్దా?: తేజస్వీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు భారత్ పంపకపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలుండకూడదని పేర్కొన్నారు. ‘పాక్ ఆటగాళ్లు మన దేశానికి రావాలి. మన వాళ్లు అక్కడికి వెళ్లాలి. క్రీడల్లో యుద్ధమేం జరగడం లేదు కదా? పీఎం మోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు లేని అభ్యంతరం, మన జట్టును అక్కడికి పంపించడానికెందుకు?’ అని ప్రశ్నించారు.

Similar News

News December 15, 2025

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హుడు: SC

image

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్‌కీ తేడా ఉంది. రిజైన్‌తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.

News December 15, 2025

విద్యార్థులకు వేడి ఆహారమే ఇవ్వాలి: మంత్రి

image

AP: చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని బీసీ సంక్షేమ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, గదుల్లో దోమలు చొరబడకుండా తెరలు వాడాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, ఆ తరువాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని ఉన్నతాధికారుల సమీక్షలో తెలిపారు.

News December 15, 2025

ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

image

TG: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే 394 పంచాయతీలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లుండి(DEC 17) 182 మండలాల్లో మిగిలిన 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.