News November 29, 2024
PM వెళ్లి బిర్యానీ తినొచ్చు కానీ టీమ్ ఇండియా వెళ్లొద్దా?: తేజస్వీ

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ జట్టును పాకిస్థాన్కు భారత్ పంపకపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలుండకూడదని పేర్కొన్నారు. ‘పాక్ ఆటగాళ్లు మన దేశానికి రావాలి. మన వాళ్లు అక్కడికి వెళ్లాలి. క్రీడల్లో యుద్ధమేం జరగడం లేదు కదా? పీఎం మోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు లేని అభ్యంతరం, మన జట్టును అక్కడికి పంపించడానికెందుకు?’ అని ప్రశ్నించారు.
Similar News
News October 23, 2025
స్వదేశీ సత్తా.. ట్రాకింగ్లో ‘రియా’ అద్భుతం!

ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ నినాద స్ఫూర్తితో BSF శిక్షణ ఇచ్చిన స్వదేశీ జాతి శునకాలు సత్తా చాటాయి. టేకాన్పూర్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన ‘రియా’ అనే భారతీయ శునకం 116 విదేశీ జాతులను అధిగమించింది. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ‘రియా’ ఏకంగా ‘బెస్ట్ ట్రాకర్ ట్రేడ్ డాగ్’ & ‘డాగ్ ఆఫ్ ది మీట్’ అనే రెండు టైటిల్స్ను గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి స్వదేశీ శునకం ఇదే కావడం విశేషం.
News October 23, 2025
థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే జీవక్రియల పనితీరు బాగుంటుంది. లేదంటే పలు సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. దీనికోసం మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు. అయోడిన్ ఉన్న ఉప్పు, చిక్కుళ్లు, బటానీలు, ఇన్ఫ్లమేషన్ తగ్గించే విటమిన్ C ఉండే ఫ్రూట్స్, ఫిష్, ఓట్స్, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ✍️ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.
News October 23, 2025
కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం

TG: రానున్న గంట సేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఇప్పటికే చాలా చోట్ల ముసురు వాతావరణం నెలకొంది.