News October 13, 2024
PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ
రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.
Similar News
News October 13, 2024
బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీగా జీతం
హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (HURL)లో 212 డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: డిప్లొమా/బీఈ/బీటెక్. జీతం: రూ.23,000 నుంచి రూ.1,40,000. పూర్తి వివరాలకు <
News October 13, 2024
సూపర్ ఫాస్ట్ పెయిన్ సిగ్నల్స్ ఇవే..
మనిషి శరీరానికి దెబ్బలు తగలడం, గిచ్చడం, చెంప దెబ్బలు, కొరకడం ఇలా చాలా రకాలుగా నొప్పి కలుగుతుంది. అయితే అన్నింటికంటే జుట్టు లాగడంతో కలిగే నొప్పి అత్యంత వేగంగా వస్తుందని స్వీడన్ పరిశోధకులు తెలిపారు. ఈ నొప్పికి సంబంధించిన సందేశాలు 160 Km/H వేగంతో నరాల ద్వారా మెదడుకు చేరుతాయన్నారు. ఈ నొప్పికి PIEZO2 అనే ప్రొటీన్ కారణమని తెలిపారు. ఇది తక్కువగా ఉన్న వారు జుట్టు లాగడం ద్వారా వచ్చే పెయిన్ అనుభవించరు.
News October 13, 2024
మరణంలోనూ దాతృత్వం.. ఆస్పత్రికి సాయిబాబా డెడ్బాడీ
TG: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమకారుడు జీఎన్ <<14342758>>సాయిబాబా<<>> అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాయిబాబా కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కు డొనేట్ చేస్తామని చెప్పారు. ఆయన భౌతికకాయానికి స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించిన అనంతరం డెడ్బాడీని ఆస్పత్రికి అప్పగిస్తామన్నారు.