News February 6, 2025
ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈనెల 24న విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆరోజున బిహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో ₹2వేల చొప్పున మొత్తం ₹6వేలు అందిస్తోంది. e-KYC పూర్తి చేసిన వారికే ఈ డబ్బులు జమవుతాయి.
Similar News
News April 2, 2026
బాబోయ్.. నర్సరీ ఫీజు రూ.3.74 లక్షలు!

కార్పొరేట్ స్కూళ్లలో చదువు‘కొనాలంటే’ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రధాన నగరాల్లో ఫీజులు లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం. తన కొడుకు నర్సరీ ఫీజు ₹3,74,340 అని గురుగ్రామ్(హరియాణా)కు చెందిన ‘ది పీపుల్ స్టూడియో’ ఫౌండర్ పూజా సేతియా తెలిపారు. 3 విడతల్లో ₹1,24,780 చొప్పున చెల్లించాలని చెప్పారని స్క్రీన్షాట్ షేర్ చేశారు. ‘పిల్లాడికి ఇంట్లోనే చదువు చెప్పించి, ఆ డబ్బును SIP చేయాలనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు.
News April 2, 2026
చద్దాకు వెల్లువెత్తుతున్న మద్దతు!

రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా <<19547250>>రాఘవ్ చద్దా<<>>ను ఆప్ తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. SMలో ఆయనకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పక్షాన నిలబడిన MPకి ఇచ్చే గౌరవం ఇదా అని నిలదీస్తున్నారు. ఆయనకు అన్యాయం జరిగిందంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలగింపునకు గల కారణాలను పార్టీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీంతో చద్దాకు, పార్టీకి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
News April 2, 2026
అంబ’s రివెంజ్.. తెలుగులో తొలి ఏఐ చిత్రం!

‘‘అంబ’s రివెంజ్’’ పేరుతో తెలుగులో తొలి ఏఐ చిత్రం రూపొందుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మహాభారతంలోని అంబ కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీష్ముడిపై ఆమె పెంచుకున్న పగ, ప్రతీకారం వెనుక ఉన్న ఆవేదనను చూపించబోతున్నారు. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ కాగా, శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు.


