News December 7, 2024

PM కిసాన్: ఏడాదికి రూ.6,000.. కేంద్రం కీలక ప్రకటన

image

PM కిసాన్ కింద ఏడాదికి ₹6వేల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి రామ్‌నాథ్ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్స్, ఉన్నతాదాయ వర్గాలు, GOVT ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 వాయిదాల్లో ₹3.46L Cr రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. AUG-NOV కాలానికి 9.58 కోట్ల మందికి ₹20,657Cr చెల్లించామన్నారు.

Similar News

News December 5, 2025

14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://examinationservices.nic.in/<<>>

News December 5, 2025

Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

image

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.

News December 5, 2025

మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.