News December 7, 2024
PM కిసాన్: ఏడాదికి రూ.6,000.. కేంద్రం కీలక ప్రకటన

PM కిసాన్ కింద ఏడాదికి ₹6వేల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి రామ్నాథ్ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్స్, ఉన్నతాదాయ వర్గాలు, GOVT ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 వాయిదాల్లో ₹3.46L Cr రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. AUG-NOV కాలానికి 9.58 కోట్ల మందికి ₹20,657Cr చెల్లించామన్నారు.
Similar News
News November 24, 2025
ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్కు లింక్ అయ్యేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్మీట్లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT


