News April 18, 2024
ఏపీకి రానున్న ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రానికి రానున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట లేదా కడపతో పాటు మరో నియోజకవర్గంలోనూ ఆయన పాల్గొంటారు. ప్రధానితోపాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా సభల్లో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మోదీ పర్యటన తేదీలు ఇంకా షెడ్యూల్ చేయాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
‘క్రెడిట్’ రాజకీయం.. BRS ఓటమికి కీలక కారణం?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత KTRకు అప్పగించడం కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని టాక్. గెలిస్తే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని దూరంగా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ MLAలు ఆయనతో కలిసి రాలేదని కొంతమంది శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అటు హరీశ్ రావు తన తండ్రి మరణంతో ఏమీ చేయలేకపోయారు. ఇక కిందిస్థాయి కేడర్ను కవిత కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. అంతాకలిసి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.
News November 14, 2025
RITESలో 252 పోస్టులకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<
News November 14, 2025
ఈ 3 కారణాలతోనే బిహార్లో ఓటమి: కాంగ్రెస్ లీడర్లు

బిహార్ ఎన్నికల్లో ఈసారైనా తమకు అధికారం దక్కుతుందని ఆశపడిన కాంగ్రెస్కు మరోసారి భంగపాటు తప్పలేదు. NDA భారీ విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఊహించలేదు. బీసీ, ఈబీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓటు బ్యాంక్ కోల్పోవడం, గతంలో ఎన్డీయేలో ఉన్న అభ్యర్థులకు టికెట్లివ్వడం, SIR, ఓట్ చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వడం తమ ఓటమికి కారణాలుగా వారు భావిస్తున్నారు. కాగా NDA 200+ స్థానాల్లో లీడ్లో ఉంది.


