News May 5, 2024
రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే ఈ నెల 7న రాజంపేట నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Similar News
News January 2, 2026
టోల్ ప్లాజాల వద్ద ‘ఫ్రీ’ రూట్ కావాలి.. ఎంపీ సానా సతీష్ ట్వీట్

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జాతీయ రహదారిపై 4రోజుల పాటు టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎక్స్(ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు ‘ఫ్రీ’ విధానం అమలు చేయాలని సూచించారు.
News January 2, 2026
Yum! డీల్.. McD, డొమినోస్కు గట్టి పోటీ

దేవయాని, సపైర్ సంస్థల విలీనంతో మెక్ డొనాల్డ్స్, డొమినోస్కు సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. USA కంపెనీ Yum!కి చెందిన KFC, పిజ్జా హట్లను దేశంలో దేవయాని, సపైర్ వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడీ $934 మిలియన్ల డీల్తో మెర్జర్ ప్రకటించాయి. దీంతో వీటికి మ్యాన్పవర్, కార్గో తదితర కాస్ట్ తగ్గి ఆఫర్స్ సహా కొత్త బై ప్రొడక్ట్స్తో ప్రత్యర్థులకు కాంపిటీషన్ ఎక్కువ కావచ్చు.
News January 2, 2026
సకల శాఖల విచ్ఛిన్న మంత్రి మిస్సింగ్: YCP

AP: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విదేశాల్లో వ్యక్తిగత పర్యటనల్లో ఉన్నారన్న వార్తలపై వైసీపీ కౌంటర్లు వేస్తోంది. ‘అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు, సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు’ అంటూ ట్వీట్లు చేసింది. వాళ్లు కనబడుటలేదు అంటూ పోస్టర్లు కూడా క్రియేట్ చేసింది. వారి వ్యక్తిగత పర్యటనపై గోప్యత ఎందుకని YCP నేతలు ప్రశ్నిస్తున్నారు.


