News April 25, 2024

PM మోదీకి గుణపాఠం చెప్పాలి: CM రేవంత్

image

TG: పార్లమెంటు ఎన్నికల్లో PM మోదీకి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ పిలుపునిచ్చారు. ‘ఏటా ఉద్యోగాల పేరుతో యువతను, ఖాతాల్లో ₹15లక్షలు వేస్తామని ప్రజల్ని మోదీ మోసం చేశారు. నల్లచట్టాలు తెచ్చి కార్పొరేటర్లకు దోచిపెట్టారు. రైతులు పోరాటం చేయడంతో వెనక్కి తగ్గారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో దగా చేస్తున్నారు. సిలిండర్ ధరను ₹1200కు పెంచారు’ అని విమర్శించారు.

Similar News

News March 4, 2026

గర్భిణుల్లో రక్తహీనతకు కారణం ఇదే!

image

కట్టెలు, పిడకలు మండించి వంట చేయడం వల్ల కలిగే వాయు కాలుష్యం ఇండియాలోని గర్భిణులలో రక్తహీనత ముప్పును 43% పెంచుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘దీనివల్ల వెలువడే విషవాయువులు రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేద మహిళలు దీని బారిన పడుతున్నారు. రక్తహీనతను తగ్గించి తల్లీబిడ్డల ఆరోగ్యం కాపాడాలంటే స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడటం అత్యవసరం’ అని నిపుణులు సూచిస్తున్నారు.

News March 4, 2026

ఇంటర్వ్యూతో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>షిప్‌యార్డ్ లిమిటెడ్ 3 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 10న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS అర్హతతో పాటు పని అనుభవం, మలయాళం భాషా పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. నెలకు రూ.75వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in

News March 4, 2026

శాసన మండలి ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?

image

AP: శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టాలని రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ రాజీనామాను ఇంతవరకూ ఆమోదించకపోవడంపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ ఈ లిస్టులో ఉన్నారు.