News March 30, 2024

మే మొదటివారం రాష్ట్రానికి పీఎం మోదీ

image

TG: ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మే నెలలో రాష్ట్రానికి రానున్నారు. మే 5 నుంచి 7 వరకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. మే 13న పార్లమెంటు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం ఎన్నికలకు వీలైనంత సమీపంలో ఉండేలా బీజేపీ ప్రణాళిక రచించుకుంటున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఈసారి రెండంకెల సీట్లను సాధిస్తామంటోంది కాషాయదళం.

Similar News

News November 28, 2025

అన్నల ఆలోచన మారిందా..?

image

ఇటీవల మల్లోజుల, ఆశన్న వంటి అగ్రనేతలు లొంగిపోతే వారు ఉద్యమ ద్రోహులని మండిపడుతూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కానీ JAN-1న అందరం లొంగిపోతామని ప్రకటించిన తాజా లేఖలో ఆయుధాలు వీడటమంటే ప్రజలను మోసం చేసినట్లు కాదని పేర్కొంది. ‘సంఘర్షణకు ఇది సరైన సమయం కాదు.. అందుకే ఆయుధ పోరాటం వీడుతున్నాం’ అని వివరించింది. అన్నల్లో ఆలోచన మార్పుకు కారణం.. వాస్తవం అర్థమవడమా? అన్ని దారులు మూసుకుంటున్నాయనే ఆందోళనా?

News November 28, 2025

దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. అతి భారీ వర్షాలు!

image

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాను గంటకు 7KM వేగంతో పయనిస్తున్నట్లు IMD వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంకకు 50KM, చెన్నైకి 540KM, పుదుచ్చేరికి 440KM దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ NOV 30న తమిళనాడు-దక్షిణ కోస్తా తీరానికి చేరే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపటి నుంచి DEC 4 వరకు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.

News November 28, 2025

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.