News March 30, 2024

మే మొదటివారం రాష్ట్రానికి పీఎం మోదీ

image

TG: ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మే నెలలో రాష్ట్రానికి రానున్నారు. మే 5 నుంచి 7 వరకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. మే 13న పార్లమెంటు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం ఎన్నికలకు వీలైనంత సమీపంలో ఉండేలా బీజేపీ ప్రణాళిక రచించుకుంటున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఈసారి రెండంకెల సీట్లను సాధిస్తామంటోంది కాషాయదళం.

Similar News

News October 21, 2025

గ్రామాల రక్షణకు మహిళల గ్రీన్ ఆర్మీ

image

UP వారణాసి గ్రామాల్లో పరిశుభ్రత, చైతన్యం కోసం మహిళలతో ఏర్పడిన గ్రీన్‌ఆర్మీ ఎన్నో సాంఘిక సంస్కరణలు చేస్తోంది. 2015లో రవిమిశ్ర అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆర్మీలో 2,200 మంది మహిళలు ఉన్నారు. వీరు గృహహింస, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరిస్తున్నారు. చెప్పులు, నారసంచుల తయారీతో ఉపాధి కూడా పొందుతున్నారు. వీరి కృషిని గుర్తించి PM మోదీ కూడా అభినందించారు.

News October 21, 2025

56 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

AP: చిత్తూరు DHMO 56 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, MBBS, CA, Mcom, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/

News October 21, 2025

నవంబర్ 19న చీరల పంపిణీ!

image

TG: మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న పంచాలని భావిస్తోంది.