News January 11, 2025
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూర్కు ప్రధాని మోదీ

వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2023 జులైలో ఆయన అక్కడ పర్యటించారు. ఆ తర్వాత 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విశిష్ఠ అతిథిగా భారత్కు వచ్చారు.
Similar News
News January 27, 2026
నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన కేంద్ర బృందం

TG: సింగరేణి కంపెనీలో CSR నిధులు దుర్వినియోగం అయినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల బృందం గుర్తించింది. మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్, రాజీవ్ అభయ హస్తం పథకం సహా కొన్ని ఇతర అంశాలకూ ఈ నిధులు వినియోగించినట్లు కనుగొంది. అలాగే నైనీ బొగ్గు టెండర్ల డాక్యుమెంట్లను లోతుగా విశ్లేషణ చేసింది. వీటిపై తన పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. గత వారం బృందం HYD వచ్చి విచారించడం తెలిసిందే.
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.


