News March 31, 2025
ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
Similar News
News January 3, 2026
5వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఆధార్ క్యాంపులు

AP: ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ఈ నెల 5 నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో 10.57 లక్షల మంది 17ఏళ్ల లోపు వారు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. నీట్, JEE పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని క్యాంపుల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్లకు సూచించింది.
News January 3, 2026
పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
News January 3, 2026
ఇతిహాసాలు క్విజ్ – 116

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


