News February 12, 2025
వాన్స్ కుటుంబంతో పీఎం మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739319894224_367-normal-WIFI.webp)
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబాన్ని కలిశారు. వాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి, వారి పిల్లలతో కలిసి ఫొటో దిగారు. వివిధ అంశాలపై మంచి చర్చ జరిగిందని పేర్కొన్నారు. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ అద్భుతంగా ఉన్నాయని వాన్స్ ట్వీట్ చేశారు. పిల్లలు ఆయన్ను ఎంతో ఇష్టపడ్డారని రాసుకొచ్చారు. కాగా ఉష తల్లిదండ్రులది ఏపీలోని కృష్ణా జిల్లా.
Similar News
News February 12, 2025
నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739328875777_782-normal-WIFI.webp)
AP Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయన 4రోజులపాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.
News February 12, 2025
టాయిలెట్లోకి ఫోన్ తీసుకెళ్తే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739329255228_367-normal-WIFI.webp)
టాయిలెట్లలో ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై ఒత్తిడి పడుతుందని, రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బి పైల్స్, ఫిషర్స్కు దారి తీస్తుంది. టాయిలెట్లోని ప్రమాదకర బ్యాక్టీరియాలు, క్రిములు స్క్రీన్పై చేరి అతిసారం, కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు వస్తాయి.
Share it
News February 12, 2025
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738032376683_1045-normal-WIFI.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు సమకూరింది.