News September 13, 2025
నేడు మణిపుర్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 28, 2026
H-1B ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపు!

USలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల వేతనాలను పెంచుతూ లేబర్ డిపార్ట్మెంట్ కొత్త ప్రతిపాదనలు చేసింది. H-1B, E-3 వంటి వీసాదారులకు ఇచ్చే మినిమం శాలరీ పెరగనుంది. దీనివల్ల ఏటా ఒక్కో ఉద్యోగికి ₹13 లక్షల అదనపు లబ్ధి చేకూరనుంది. విదేశీయులకు తక్కువ జీతాలిచ్చి స్వదేశీయులను తొలగించకుండా ఉండేందుకే 20 ఏళ్ల పాత వేతన విధానాన్ని మారుస్తున్నారు. వీటిపై అభిప్రాయాలు సేకరించి అమలు చేస్తారు.
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో పరాగసంపర్కం

ఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా, కీటకాల ద్వారా జరుగుతుంది. ఇలాయిడోబియస్ కామెరూనికస్ అనే కీటకం పరాగ సంపర్కంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 2.5 సంవత్సరాల తర్వాత తోటల్లో ఈ కీటకాలను విడుదల చేస్తే ఫలదీకరణ బాగా జరిగి ఫలములు ఏర్పడతాయి. చెట్లు ఆరోగ్యంగా లేకపోతే ఈ కీటకాలను 3 సంవత్సరాల తర్వాత తోటల్లో విడుదల చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 28, 2026
నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.


