News July 23, 2024
యువత కోసం 5 పథకాలతో ‘పీఎం ప్యాకేజీ’

ఈ బడ్జెట్లో యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం ఏదైనా తొలి నెల వేతనం కింద రూ.15,000 నగదు బదిలీ ఇందులోకే వస్తుంది.
Similar News
News December 22, 2025
న్యూజిలాండ్తో ట్రేడ్ డీల్.. భారత్కేంటి లాభం?

భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన <<18638346>>ఫ్రీ ట్రేడ్ డీల్<<>> వల్ల ఇక్కడి నుంచి వెళ్లే అన్ని వస్తువులపై అక్కడి మార్కెట్లో సుంకాలు ఉండవు. టెక్స్టైల్స్, జువెలరీ, ఇంజినీరింగ్ రంగాలకు ఇది ఎంతో లాభదాయకం. IT, హెల్త్కేర్తో పాటు యోగా, ఆయుష్ వంటి రంగాల్లోని ఇండియన్ ప్రొఫెషనల్స్కు వీసా లభిస్తుంది. మన ఫార్మా కంపెనీలకు సులభంగా అనుమతులు వస్తాయి. 15 ఏళ్లలో NZ ఇక్కడ 20 బి.డాలర్ల పెట్టుబడులు పెడుతుంది.
News December 22, 2025
ఇండియాలో ఫస్ట్ క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారైంది?

కేరళ రాష్ట్రం తలస్సేరిలో 1883లో మొదటిసారి క్రిస్మస్ కేక్ తయారైంది. యూరోపియన్ రెసిపీ ఫ్రూట్ కేక్ను ఇండియన్స్కు నచ్చేలా మాంబల్లిలోని రాయల్ బిస్కెట్ ఫ్యాక్టరీలో వెస్టర్న్ బేకింగ్ పద్ధతులను ఉపయోగించి బాపు తయారు చేశారు. కేరళ ప్లమ్ కేక్గా పాపులర్ అయిన దీని టేస్ట్కు భారతీయులు ఫిదా అయ్యారు. అప్పట్లో క్రిస్మస్ టైమ్లో తయారు చేసి అమ్మేవారు. కేరళలో మొదలైన క్రిస్మస్ కేక్ కల్చర్ నేడు దేశమంతా వ్యాపించింది.
News December 22, 2025
ఆధిపత్యం కోసం ఆరాటం.. అప్పుల ఊబిలో క్విక్ కామర్స్ సైట్స్!

10 నిమిషాల డెలివరీతో కిరాణ దుకాణాల మనుగడను దెబ్బతీస్తోన్న క్విక్ కామర్స్ సైట్స్ కూడా ₹వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇన్స్టామార్ట్ ₹వెయ్యి కోట్లు, జెప్టో ₹1,250 కోట్లు, బ్లింకిట్ ₹110 కోట్లు లాస్లో ఉండి ఇన్వెస్టర్లను సైతం ఇబ్బందుల్లోకి నెట్టాయని నిపుణులు చెబుతున్నారు. దుకాణానికి వెళ్లే సంస్కృతిని దూరం చేసి ఫ్యూచర్లో గుత్తాధిపత్యం సాధించి కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.


