News August 24, 2025

ఆ బిల్లుకు PM అతీతం కాకూడదన్నారు: కిరణ్ రిజుజు

image

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు PM అతీతం కాకూడదని మోదీ చెప్పినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ‘బిల్లు నుంచి ప్రధానికి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని మోదీ క్యాబినెట్‌కు చెప్పారు. ప్రధాని కూడా ఒక పౌరుడేనని, ఆయనకు ప్రత్యేక రక్షణ అవసరంలేదని చెప్పారు. అత్యధిక సీఎంలు మన పార్టీ వాళ్లే ఉన్నారని, వాళ్లు తప్పు చేస్తే పదవిని వదులుకోవాల్సిందే అని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు.

Similar News

News August 24, 2025

యూఎస్ ఓపెన్.. ఎవరు సొంతం చేసుకుంటారో?

image

నేటి నుంచి యూఎస్ ఓపెన్(టెన్నిస్) మొదలు కానుంది. పురుషుల సింగిల్స్‌లో 25వ టైటిల్‌పై కన్నేసిన సీనియర్ ప్లేయర్ జకోవిచ్ వరుస పరాజయాలకు తెరదించుతారో చూడాలి. చివరి 3 టోర్నీల్లో సెమీస్‌లోనే జకో ఇంటిదారి పట్టారు. అటు యువ ప్లేయర్లు సిన్నర్, అల్కరాజ్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సబలెంకా, స్వైటెక్, కోకో గాఫ్ మధ్య పోరు నెలకొంది. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ కూడా బరిలో ఉన్నారు.

News August 24, 2025

ఇవాళ సురవరం అంతిమయాత్ర..

image

TG: సీపీఐ సీనియర్ నేత <<17490970>>సురవరం<<>> సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్‌లోని మఖ్ధూం భవన్‌(CPI ఆఫీసు)కు తరలించనున్నారు. ఉ.10-మ.3 గంటల వరకు ప్రజా సందర్శనకు ఉంచుతారు. CM రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర నేతలు నివాళి అర్పించనున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధన కోసం భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.

News August 24, 2025

స్త్రీ శక్తి.. మహిళలకు రూ.41.22 కోట్లు మిగులు: టీడీపీ

image

AP: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకంతో వారం రోజుల్లోనే మహిళలకు రూ.41.22 కోట్లు మిగిలాయని టీడీపీ ట్వీట్ చేసింది. ఏడు రోజుల్లో 1.04 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని వెల్లడించింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే స్త్రీ, పురుష నిష్పత్తి 40:60 ఉంటే ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొంది. కొత్త పథకం అమల్లోకి వచ్చాక పురుష ప్రయాణికులు తగ్గి మహిళలు పెరిగారని తెలిపింది.