News March 28, 2025

వచ్చే నెలలో థాయ్‌లాండ్, శ్రీలంకలో పీఎం పర్యటన

image

వచ్చే నెల 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొంది. 2018లో నేపాల్‌లో జరిగిన సదస్సు అనంతరం BIMSTEC నేతలు సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంక పర్యటనలో ఆయన పలు ఒప్పందాల్ని చేసుకునే అవకాశం ఉంది.

Similar News

News March 31, 2025

‘బేబి’కి రూ.కోటి రెమ్యూనరేషన్?

image

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండగా ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.

News March 31, 2025

పాస్టర్ ప్రవీణ్ మృతి.. కొత్త విషయాలు

image

AP: పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారనే మిస్టరీ వీడింది. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల దూరంలో బైక్ ఆపి కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. సా.5.30 నుంచి రా.8.45 వరకు అక్కడే ఉన్నారని తెలిపారు. 200 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన విజయవాడకు రాకముందే ప్రమాదంలో బైక్ హెడ్ లైట్ దెబ్బతిందని, అయినా రాజమండ్రికి ప్రయాణం కొనసాగించారని గుర్తించారు.

News March 31, 2025

CSK ‘ధోనీ’ని వదులుకోలేక!

image

ధోనీ ఉంటేనే CSK. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తే సగటు చెన్నై ఫ్యాన్‌కి అసహనం కలుగుతోంది. బ్యాటింగ్‌లో మేనేజ్మెంట్ ధోనీకి స్వేచ్ఛనివ్వగా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావట్లేదని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. అటు శరీరం సహకరించక MS ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని తెలిపారు.

error: Content is protected !!