News June 26, 2024
పోచారం, సంజయ్లను అనర్హులుగా ప్రకటించాలి: జగదీశ్రెడ్డి

TG: BRS టికెట్పై MLAలుగా గెలిచి ఇటీవల కాంగ్రెస్లోకి వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్కుమార్లను అనర్హులుగా ప్రకటించాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్, పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యతిరేకంగా ఉన్నారని, ఫిరాయింపుల గురించి ఆ పార్టీ ‘పాంచ్ న్యాయ్’లోనూ ఉందని ఆయన గుర్తు చేశారు.
Similar News
News December 10, 2025
అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.
News December 10, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News December 10, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✒ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనికి Dy కలెక్టర్గా ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
✒ గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.2,123కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు
✒ రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది DEOలు ట్రాన్స్ఫర్
✒ అమరావతికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ఈ-లాటరీ
✒ తిరుమల కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్, ఏ29 సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న సీబీఐ-సిట్ అధికారులు


