News March 17, 2024
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పొదెం వీరయ్య

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి దక్కింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా పొదెం గుర్తింపు పొందారు. పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఏకతాటిపై నడిపించారు.
Similar News
News August 16, 2025
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఉద్యోగుల కృషి, సహకారం వల్లనే ఈ పురస్కారం పొందానని సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
News August 16, 2025
గ్యాలంటరీ మెడల్ స్వీకరించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్యాలంటరీ మెడల్ స్వీకరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్య సాహసాలతో సమర్థవంతంగా నిర్వర్తించినందుకుగాను పోలీస్ కమిషనర్ గ్యాలంటరీ మెడల్-2024 కు ఎంపికయ్యారు. పోలీస్ కమిషనర్ కు గ్యాలంటరీ మెడల్ రావడం పట్ల జిల్లా పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News August 15, 2025
ఖమ్మం: ‘గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు’

జిల్లాలో గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్నేరు నదిలో వినాయక నిమజ్జనం పాయింట్లుగా ఏర్పాటు చేయుటకు పెద్దతండ, ప్రకాష్ నగర్ వద్ద ప్రాంతాలను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. గణేష్ నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు భారీ క్రేన్లు, లైటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.