News October 26, 2024
కావాలనే HYDపై విషప్రచారం: భట్టి
TG: హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిపై కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. మంచినీటి సమస్య లేకుండా గోదావరి, కృష్ణ, మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల JAC నేతలతో భట్టి సమావేశం ముగిసింది. ఇవాళ కనీసం ఒక డీఏ అయినా ప్రకటించే ప్రయత్నం చేస్తామన్నారు.
Similar News
News October 26, 2024
ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్
భారత్లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.
News October 26, 2024
ఎల్లుండి భూమి సమీపానికి భారీ గ్రహశకలం
ఈ నెల 28న ఓ భారీ గ్రహశకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉండే ఈ గ్రహ శకలం భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది సెకనుకు 9.43 కి.మీ వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News October 26, 2024
ఇందిరమ్మ ఇళ్లు.. బిగ్ అప్డేట్
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యాప్ను పరిశీలించిన ఆయన పలు మార్పులు చేయాలని సూచించారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు.