News March 7, 2025

POK స్వాధీనం: మోదీ సర్కారు బిగ్ ప్లానింగ్!

image

POK స్వాధీనంపై మోదీ సర్కారు గురిపెట్టిందని నిపుణుల అంచనా. వారు ఉదహరిస్తున్న జియో పొలిటికల్ ఈవెంట్లు ఇవే. అంతర్గత వివాదాలతో అట్టుడుకుతున్న పాక్‌ నుంచి బలూచిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకొనే అవకాశముంది. తాలిబన్లు డ్యూరాండ్ రేఖను ఆక్రమిస్తున్నారు. కార్గిల్లో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని దించింది. POK స్వాధీనంతో కశ్మీర్ సమస్య అంతమవుతుందని లండన్లో జైశంకర్ అన్నారు. మరి ఎవరు ఆపారని JK CM ప్రశ్నించారు.

Similar News

News March 9, 2025

కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించిన వ్యక్తి హతం

image

పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కిడ్నాప్‌కు సహకరించిన ముఫ్తీ షా మిర్‌ను గుర్తుతెలియని దుండగులు బలూచిస్థాన్‌లో కాల్చి చంపారు. 2016లో కుల్‌భూషణ్‌‌ను ఇరాన్-పాకిస్థాన్ బార్డర్‌లో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. జాదవ్‌ను కిడ్నాప్ చేసిన బృందంలో సభ్యుడు, జైష్-అల్-అదిల్ నేత ముల్లా ఒమర్ ఇరానీ సైతం 2020లో హతమవ్వడం గమనార్హం.

News March 9, 2025

మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వనున్న వీవీ వినాయక్?

image

స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. విక్టరీ వెంకటేశ్‌తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ ఇప్పటికే స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారని సమాచారం. నల్లమలుపు బుజ్జి నిర్మించొచ్చని సినీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురి కాంబోలో 2006లో వచ్చిన ‘లక్ష్మీ’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.

News March 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్‌ఫ్లూ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ రూ.160-180గా ఉంది. ఖమ్మంలో రూ.150-170 ధర ఉంది. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.200, కాకినాడలో రూ.170-190, విశాఖలో రూ.190 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

error: Content is protected !!