News October 24, 2024

పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను అప్పటిలోగా పూర్తి చేయాలి: సీఎం

image

AP: పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బావర్ కంపెనీ ప్రతినిధులను CM చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏటా ₹983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ₹275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జల వనరుల శాఖ సమీక్షలో తెలిపారు. ఇక నుంచి అలా జరగరాదని, ఈ ఏడాదికి అవసరమైన మొత్తం నిధులను ఏకకాలంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 9, 2025

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

image

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్‌లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.

News December 9, 2025

అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

image

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్ జారీ చేసింది. అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉన్న ఉరక్కుళి జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించింది. ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, ఏనుగులు, వన్యప్రాణుల సంచారం కూడా పెరగడం, ఆ మార్గం ఏటవాలుగా, జారుడుగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ సూచనలు చేసింది. సాధారణంగా అడవిలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తారు.

News December 9, 2025

రాయ్‌బరేలిలో ‘ఓట్ చోరీ’తో గెలిచిన ఇందిరా గాంధీ: బీజేపీ MP

image

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె విమర్శించారు. రాయ్‌బరేలిలో ఇందిరా గాంధీ ‘ఓట్ చోరీ’తోనే గెలిచారని ఆరోపించారు. తాను RSS నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోక్‌సభలో ఎలక్షన్ రిఫామ్స్‌పై జరుగుతున్న చర్చలో RSS, ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను దూబె తిప్పికొట్టారు.