News October 24, 2024
పోలవరం డయాఫ్రమ్ వాల్ను అప్పటిలోగా పూర్తి చేయాలి: సీఎం
AP: పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బావర్ కంపెనీ ప్రతినిధులను CM చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏటా ₹983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ₹275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జల వనరుల శాఖ సమీక్షలో తెలిపారు. ఇక నుంచి అలా జరగరాదని, ఈ ఏడాదికి అవసరమైన మొత్తం నిధులను ఏకకాలంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 24, 2024
మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్
TG: గత ప్రభుత్వంలోని ముఖ్యులపై ఫైల్స్ సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నవంబర్ 1 నుంచి 8 వరకు అందరూ లోపలికి వెళతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరో రెండుమూడు రోజుల్లో సంచలనం జరగబోతోందంటూ బాంబు పేల్చారు. మంత్రి దేని గురించి మాట్లాడారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
News October 24, 2024
నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీ?
AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.
News October 24, 2024
భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం
AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.