News June 28, 2024

పోలవరం అనుమతులన్నీ తెచ్చింది వైఎస్సారే: అంబటి

image

AP: పోలవరం ప్రాజెక్టు విషయంలో CM చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘తానే ఏడు గ్రామాలను APలో విలీనం చేశారని CBN గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రాజెక్టుకు 2005 నుంచి క్లిష్టమైన అనుమతులన్నీ వైఎస్సారే తెచ్చారు. పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస ప్రణాళిక, పాపికొండల వన్యప్రాణ సంరక్షణ కేంద్రం మళ్లింపు లాంటి అనుమతులు తీసుకొచ్చారు’ అని గుర్తు చేశారు.

Similar News

News January 29, 2026

చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు!

image

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్నాడో వ్యక్తి. బాబుభాయ్(60) ఇంట్లో కూర్చొని ఉండగా చిరుతపులి దాడి చేసింది. అక్కడే ఉన్న శార్దూల్‌(27) అరవడంతో అతడిపైకి దూకింది. దీంతో కొడుకును కాపాడుకునేందుకు బాబుభాయ్ కొడవలి, ఈటెతో చిరుతను కొట్టి చంపేశాడు. తర్వాత అటవీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News January 29, 2026

రాత్రి నానబెట్టి ఉదయం తింటే..

image

రోజువారీ ఆహారంలో పెసలు తప్పకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండే పెసలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
*పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.
*చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది.
*గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.
**రాత్రి నానబెట్టి ఉదయం మొలకల రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

News January 29, 2026

SC స్కాలర్షిప్‌లకు ఆదాయ పరిమితిని పెంచనున్న కేంద్రం

image

SC విద్యార్థుల స్కాలర్షిప్‌ల మంజూరులో పేరెంట్స్ గరిష్ఠ ఆదాయ పరిమితిని ₹2.5 లక్షల నుంచి ₹4.5 లక్షలకు కేంద్రం పెంచనుంది. దీనిపై నోట్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్సులను బట్టి హాస్టలర్స్‌కు రూ.4,000-13,500, డేస్కాలర్స్‌కు రూ.2,000-7,500 వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ సూచనల తర్వాత క్యాబినెట్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీకి నోట్‌ను అందిస్తారు.