News June 19, 2024
అసమర్థుడి మూర్ఖత్వానికి పోలవరం బలైంది: TDP

AP: జగన్ తప్పిదాలు, చేతగానితనంతో పోలవరం ప్రాజెక్టు గాడి తప్పిందని టీడీపీ విమర్శించింది. ‘ఒక అసమర్థుడి మూర్ఖత్వానికి పోలవరం బలైంది. అధికారం ఇచ్చారని రాష్ట్రాన్నే గోదావరిలో ముంచేశారు. మొత్తం సరి చేసి, పోలవరాన్ని మళ్లీ గాడిలో పెడుతుంది ప్రజా ప్రభుత్వం’ అని ట్వీట్ చేసింది. 2019 మే నాటికి, 2024 మే నాటికి ప్రాజెక్టులో ఎంత శాతం పనులు పూర్తయ్యాయనే దానిపై ఓ పట్టికను పోస్ట్ చేసింది.
Similar News
News December 26, 2025
లలిత్ మోదీ, మాల్యాలను వెనక్కు రప్పిస్తాం: విదేశాంగ శాఖ

₹వేల కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, <<18653986>>లలిత్ మోదీలను <<>> దేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, విదేశీ న్యాయ చిక్కులతో వారిని రప్పించడంలో జాప్యం అవుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో పేర్కొన్నారు. కాగా లండన్లో లలిత్ మోదీ, విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల్లో చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
తెలంగాణ కోసం పోరాడేది BRS మాత్రమే: KCR

TG: కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని, రాష్ట్రం కోసం BRS తప్ప ఇతర పార్టీలు పోరాడవని ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీలో కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని సూచించారు. సమావేశాల అనంతరం మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
News December 26, 2025
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.


