News February 2, 2025
పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స

AP: 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి నిధులు సాధించడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపుల్లేవని అన్నారు. బిహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు కుదించారని, దీని వల్ల ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
NCDCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<
News December 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.1,30,420కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 ఎగబాకి రూ.1,19,550 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,100 పెరిగి రూ.1,98,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి
News December 8, 2025
ఉప సర్పంచ్ పదవికి డిమాండ్!

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. సర్పంచ్తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండటమే దీనికి కారణం. రిజర్వేషన్లు కలిసిరానిచోట వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ అవ్వాలని పోటీ పడుతున్నారు. దీనికోసం రూ.లక్షల్లో ఖర్చుకు వెనుకాడట్లేదు. ఎస్సీ, ఎస్టీతో జనరల్ రిజర్వేషన్ ఉన్న స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అటు ఇతర వార్డు మెంబర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


