News June 28, 2024

కరోనా క్లిష్టకాలంలోనూ పోలవరం పనులు ఆగలేదు: అంబటి రాంబాబు

image

AP: YCP ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తప్పూ చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కరోనా క్లిష్టకాలంలోనూ వేగంగా పనులు చేశామన్నారు. 1995 నుంచి 2004 వరకు CMగా ఉండి, కేంద్రంలో చక్రం తిప్పిన CBN పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పోలవరాన్ని YSR ప్రారంభించారని గుర్తు చేశారు.

Similar News

News January 9, 2026

9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

image

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.

News January 9, 2026

‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

image

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.

News January 9, 2026

బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

image

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.