News June 28, 2024

కరోనా క్లిష్టకాలంలోనూ పోలవరం పనులు ఆగలేదు: అంబటి రాంబాబు

image

AP: YCP ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తప్పూ చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కరోనా క్లిష్టకాలంలోనూ వేగంగా పనులు చేశామన్నారు. 1995 నుంచి 2004 వరకు CMగా ఉండి, కేంద్రంలో చక్రం తిప్పిన CBN పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పోలవరాన్ని YSR ప్రారంభించారని గుర్తు చేశారు.

Similar News

News January 5, 2026

అసెంబ్లీ వేదికగా BRSపై కవిత విమర్శల దాడి

image

TG: శాసనమండలి వేదికగా BRSపై కవిత విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి తన బహిష్కరణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదన్నారు. సస్పెన్షన్‌కు ముందు వివరణ కూడా తీసుకోలేదని మండిపడ్డారు. పార్టీలో లేని ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నైతికత లేని పార్టీలో ఉండలేకే బయటికి వచ్చానని, పదవి కూడా వద్దనుకొని రాజీనామా చేశానన్నారు. దాన్ని ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు.

News January 5, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. TG సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. హరీశ్ ఆదేశాలతో రాధాకిషన్ ఫోన్ ట్యాప్ చేశారని 2024 DECలో FIR నమోదైంది. దీనిపై హరీశ్ కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం FIRను కొట్టివేసింది. ఇప్పుడు SCలోనూ ఆయనకు ఊరట దక్కింది. HC, SCలో ఎదురుదెబ్బ తగలడంతో ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

News January 5, 2026

బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

image

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్‌ నీటిలో 3గ్రా. కార్బరిల్‌ (లేదా) 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.