News October 6, 2025
2019 తర్వాతా CBN సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేది: నిమ్మల

2027 చివరి నాటికి PM చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2019 తర్వాత సీఎంగా CBN కొనసాగుంటే ఇప్పటికే అది పూర్తయ్యేదన్నారు. YCP హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, రివర్స్ టెండర్లంటూ పనులు జాప్యం చేశారని విమర్శించారు. తాము పనులు వేగవంతం చేశామన్నారు. బిహార్ ఎన్నికలయ్యాక కేంద్ర మంత్రి CRపాటిల్ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయనతో భేటీ అనంతరం చెప్పారు.
Similar News
News October 6, 2025
ప్రాక్టీస్ షురూ చేసిన హిట్మ్యాన్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు సెలక్ట్ అయిన హిట్మ్యాన్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 10 మంది ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్లుగా పిచ్ ఎంపిక చేసుకుని సాధన చేశారు. కాసేపు జిమ్ చేశారు. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
News October 6, 2025
మీ కోపాన్ని చాటింగ్లో చూపిస్తున్నారా?

రిలేషన్షిప్లో గొడవలు కామన్. కానీ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా చేసే వాదనలు ప్రమాదకరమని అక్రాన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. చాటింగ్ ద్వారా జరిగే గొడవలు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ సేపు జరుగుతాయని తేలింది. అలాగే ఇవి 4 రెట్లు ఎక్కువ చిరాకు తెప్పిస్తాయట. చిన్న విభేదాలు పెద్దవిగా మారి స్నేహాలు, సంబంధాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయట. అందుకే మాట్లాడి సర్దిచెప్పుకోవడం బెటర్.
News October 6, 2025
ఆ సిరప్పై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

AP: కేంద్ర ఆరోగ్యశాఖలోని DGHS సూచన ప్రకారం 2ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబుకు ద్రవరూప మందులను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయకుండా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. MP, రాజస్థాన్లో పిల్లల మరణానికి దారితీసిన కల్తీ దగ్గు మందు రాష్ట్రానికి సరఫరా కాలేదన్నారు. మెడికల్ షాపులు, ప్రభుత్వాసుపత్రులకు ఆ మందు రానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.