News March 6, 2025
YS జగన్పై పోలీసులకు ఫిర్యాదు

AP: Dy.CM పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్పై జనసేన కార్యకర్తలు ఏలూరు(D) ద్వారకా తిరుమల పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ అని నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 19, 2026
గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

గ్రీన్లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.
News January 19, 2026
శభాష్ హర్షిత్ రాణా.. నీపై బాధ్యత పెరిగింది!

NZతో జరిగిన వన్డే సిరీస్లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసి.. 83 రన్స్ చేశారు. అతను జట్టులో అవసరమా అన్న పరిస్థితి నుంచి జట్టుకు అతని అవసరముంది అనేలా రాణించారు. ట్రోల్స్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. కోచ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. అతనికి బ్యాటర్గానూ అవకాశాలిస్తే జట్టులో మంచి ఆల్రౌండర్గా ఎదిగే ఆస్కారముందని క్రీడా నిపుణులు అంటున్నారు.
News January 19, 2026
జనవరి 19: చరిత్రలో ఈరోజు

1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం * 1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం * 1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం * 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం * 1972: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (ఫొటోలో).


