News May 23, 2024

రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు: అనిల్ కుమార్ యాదవ్

image

AP: పోలింగ్ రోజు టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని నరసరావుపేట YCP MP అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ‘టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట రీపోలింగ్ నిర్వహించాలి. 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే వీడియో బయటకు రావడం ఏంటీ? టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఈసీ తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 19, 2025

HYDలో బ్రెడ్ క్రంబింగ్‌ ట్రెండ్.. బకరాలు లోడింగ్! ​

image

సిటీలో ప్రేమ ‘పెళ్లి’ దాకా వెళ్లడం లేదు.. గాల్లో దీపం పెట్టినట్లే ఉంది. పబ్‌లో పార్టీలు చేసుకుంటూ ఎదుటి మనిషికి అప్పుడప్పుడు ఓ మెసేజ్ పంపి, వాళ్లు రిప్లై ఇస్తే మళ్లీ రెండు రోజులు సైలెంట్ అయిపోవడమే ఈ కొత్త ట్రెండ్. తమ చుట్టూ తిప్పుకోవడానికి వేసే బిస్కెట్లు ఇవి. ఈ ట్రాప్‌లో పడి చాలా మంది మనసులు ముక్కలవుతున్నాయి. సో.. HYD యూత్.. ఆ ‘హాఫ్-హార్టెడ్’ లైకులను చూసి మురిసిపోకండి. బకరాగా మిగలకండి.

News December 19, 2025

₹7,910 కోట్ల ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా పేరు

image

AP: పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా గుర్తుండేలా రాష్ట్రంలో ₹7,910 కోట్లతో చేపట్టే మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా ప్రభుత్వం నామకరణం చేసింది. రానున్న 30 ఏళ్ల నాటికి 5 ఉమ్మడి జిల్లాల పరిథిలో 1.21 కోట్లమంది దాహార్తిని ఈ ప్రాజెక్టు తీర్చనుంది. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలకు ఈ స్కీమ్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుంది. జలధార పోస్టర్‌ను Dy CM పవన్ ఆవిష్కరించారు.

News December 19, 2025

ఎల్లుండి నుంచి అకౌంట్లలోకి బోనస్ డబ్బులు

image

TG: రాష్ట్రంలో వరి సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 లక్షల మంది రైతులకు బోనస్ కింద రూ.649 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం నుంచి చెల్లింపులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.