News October 9, 2025
జగన్ పర్యటన వేళ పోలీసుల సూచనలు

AP: మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సూచనలు చేశారు. నిర్వాహకులు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. హైవేలు, కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా జన సమీకరణ చేయకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ సామర్థ్యానికి మించి జనాలను సమీకరించకూడదని పేర్కొన్నారు.
Similar News
News October 9, 2025
ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్.. స్పందించిన CP సజ్జనార్

TG: పోలీసులు, నాయకుల మద్దతుతో HYDలో ట్రాన్స్జెండర్ల దందా తారస్థాయికి చేరిందని, రూ.వేలు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని ఓ నెటిజన్ Xలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ CP సజ్జనార్ను కోరారు. ‘ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం. వాస్తవాలను ధ్రువీకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. మీకూ వీరి వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయా? COMMENT
News October 9, 2025
జాతీయ మహిళా కమిషన్ ఎందుకంటే?

సమాజంలో అతివల హక్కులను కాలరాయడం, వారి హక్కులపై జరిగే దాడి, అన్యాయాలను అరికట్టడానికి మహిళా కమిషన్ పనిచేస్తుంది. 1988లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ సిఫార్సుల మేరకు 1990లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ద్వారా జాతీయ మహిళా కమిషన్ (NCW)ను ఏర్పాటు చేశారు. 1992లో NCW చట్టబద్ధమైన సంస్థగా మారింది. కౌన్సెలింగ్ సేవలతోపాటు బాధితులకు రక్షణ, తక్షణ ఉపశమనం కల్పించడానికి దోహదపడుతుంది.
News October 9, 2025
లాభాలు తెచ్చిన బంతి సాగు.. రైతుల్లో ఆనందం

దసరా, దీపావళి సీజన్లను దృష్టిలో పెట్టుకొని బంతి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలు దక్కడంతో ఆనందంగా ఉన్నారు. తొలుత వర్షాల వల్ల పంటకు కొంత నష్టం వాటిల్లినా.. బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా, శుభకార్యాల వల్ల బంతి పూలకు డిమాండ్ పెరిగి రైతులకు మంచి ఆదాయం వచ్చింది. దసరా సీజన్ ముగిసిన నాటికి ఎకరాకు రూ.2లక్షల వరకూ లాభం వచ్చిందని, దీపావళికి ఇది మరింత పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.