News October 21, 2024

దివ్వెల మాధురికి పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన మాధురి అక్కడ ఫొటోషూట్స్, రీల్స్ చేశారంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు<<14326522>> కేసు నమోదైంది<<>>. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెకు నోటీసులిచ్చారు.

Similar News

News October 21, 2024

NZ లేడీ సూపర్ స్టార్

image

టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ సిరీస్ మొత్తంలో బ్యాట్ & బాల్‌తో టీమ్ గెలుపులో కీలకంగా మారిన ఆల్ రౌండర్ అమేలియా కెర్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. టోర్నీలో ఆమె 15 వికెట్లు పడగొట్టి సింగిల్ T20 WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ టోర్నీలో ఆమె తీసిన వికెట్లు వరుసగా.. 1/19 vs IND, 4/26 vs AUS, 2/13 vs SL, 3/14 vs PAK, 2/14 vs WI, 3/24 vs SA (Finals).

News October 21, 2024

మాల్దీవ్స్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్

image

మాల్దీవ్స్‌కు వెళ్లే భారతీయులకు ప్రెసిడెంట్ ముయిజ్జు గుడ్‌న్యూస్ చెప్పారు. అక్కడ UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పేమెంట్స్ చేయడం భారతీయులకు సులభతరం కానుంది. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసె‌స్‌లో సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో మాల్దీవ్స్‌లో యూపీఐ పేమెంట్స్‌ తీసుకురావాలని ఆయన నిర్ణయించారు.

News October 21, 2024

ఎలక్షన్స్ తర్వాత అమెరికా ‘బబుల్’ బరస్టేనా!

image

US ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు $500bns నష్టాల్లో ఉన్నాయి. లిక్విడిటీ లేదు. ఇక జాతీయ అప్పు $35trns. గోల్డ్, పెట్రోల్ లేకుండానే ప్రింట్ చేస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సమానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బాహాటంగా చెప్తున్నారు. BRICS కరెన్సీ వస్తే ఇక ఆగమాగమేనని, US బుడగ ఏ క్షణమైనా టప్‌మని పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మీ కామెంట్.