News March 25, 2024

అధికారంలోకి రాగానే పోలీస్ రిక్రూట్‌మెంట్: లోకేశ్

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే పారదర్శకంగా పోలీస్ నియామకాలు చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. తాడేపల్లిలో ప్రచారంలో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు గొడవలు సృష్టిస్తారు. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News October 3, 2024

ఆ ఇళ్లకు నో పర్మిషన్: CM రేవంత్ రెడ్డి

image

TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.

News October 3, 2024

సద్గురుకు రిలీఫ్: TN పోలీస్ యాక్షన్ అడ్డుకున్న సుప్రీంకోర్టు

image

మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌పై TN పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంది. HCPని హైకోర్టు నుంచి బదిలీ చేసుకుంది. చర్యలపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. విచారణను OCT 18కి వాయిదా వేసింది. 5వేల మంది ఉండే ఆశ్రమంలోకి 150+ పోలీసులు వెళ్లారని ఈషా లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ‘అవును, అలాంటి చోటకు అలా వెళ్లకూడదు’ అని CJI ఏకీభవించారు.

News October 3, 2024

మూసీ నిర్వాసితులకు BRS రూ.500కోట్లు ఇవ్వాలి: CM

image

TG: BRS పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని CM రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్‌లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.