News July 28, 2024
పెద్దిరెడ్డి PA ఇంట్లో పోలీసుల సోదాలు

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్ల దగ్ధంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA శశికాంత్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ నివాసంలో ఈ సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో నుంచి 4 బాక్సుల్లో ఫైళ్లను తీసుకెళ్లారు. కాగా APకి చెందిన ఓ మాజీ MLA ఇంట్లో శశికాంత్ నివాసం ఉంటున్నారు. ఆ మాజీ MLA ముందే తనిఖీలు చేశారు.
Similar News
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు: ఉమ్మడి KNRలో తొలి ఏకగ్రీవం..!

సర్పంచ్ ఎన్నికల నగారా మోగిన వేళ సిరిసిల్ల జిల్లాలో ఓ GP నామినేషన్లకు ముందే <<18395111>>ఏకగ్రీవమైంది.<<>> రుద్రంగి మం. రూప్లానాయక్ తండాలో పోటీ లేకుండా సర్పంచ్ను ఎన్నుకున్నారు. నోటిఫికేషన్ ప్రకారం DEC 11న తండాలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ జవహర్లాల్ నాయక్ను తమ సర్పంచ్గా ఎన్నుకుంటూ తండావాసులు నిర్ణయం తీసుకున్నారు. 500కిపైగా జనాభా ఉన్న తండాలో మొత్తం 8 వార్డులున్నాయి. ఇక రాష్ట్రంలో తొలి ఏకగ్రీవమైన గ్రామం ఇదే.
News November 27, 2025
దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.
News November 27, 2025
అమరావతిలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ

AP: అమరావతి కృష్ణానది తీరంలో శ్రీవేంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2 దశల్లో ₹260Cr వెచ్చించనుంది. ఈ పనులకు CM CBN ఇవాళ భూమి పూజ చేయనున్నారు. దాదాపు 3వేల మంది భక్తులు పాల్గొని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాకారం, ఏడంతస్తుల రాజగోపురం, సేవా మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, విశ్రాంతి భవనం తదితర పనులు పూర్తిచేస్తారు.


