News April 25, 2024

ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలి: బొండా ఉమ

image

AP: కొందరు పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. ‘తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో నన్ను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన CPపై EC తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలి. తాము ఈసీ పరిధిలో ఉన్నామని గుర్తించాలి. విజయవాడ సెంట్రల్‌లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారు. వీరిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతాం’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News November 6, 2025

కుంకుమ పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు

image

ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తీసుకుంటే బిడ్డ తెల్లగా పుడతాడని చాలామంది భావిస్తారు. బిడ్డ చర్మ ఛాయ తల్లిదండ్రుల జీన్స్‌ని బట్టి ఉంటుందంటున్నారు నిపుణులు. కానీ ప్రెగ్నెన్సీలో కుంకుమపువ్వును తీసుకుంటే అజీర్తి, మూడ్‌ స్వింగ్స్‌, యాంగ్జైటీ, ఒత్తిడి, వేవిళ్లు, అధిక రక్తపోటు, ఐరన్ లోపం వంటివి తగ్గుతాయి. రోజుకు 2-3 రేకల్ని గ్లాసుపాలలో వేసుకొని తీసుకుంటే చాలు. దీనికి ముందు డాక్టరు సలహా తీసుకోవడం ముఖ్యం.

News November 6, 2025

మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

image

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.

News November 6, 2025

ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

image

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.