News February 28, 2025
కాజల్, తమన్నాను విచారించనున్న పోలీసులు

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ను పోలీసులు విచారించనున్నారు.
Similar News
News February 28, 2025
పోసాని బెయిల్ పిటిషన్.. సోమవారం విచారణ

APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరఫు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్జైలుకు తరలించారు.
News February 28, 2025
ఫేక్ జాబ్ నోటిఫికేషన్తో స్కామర్ల కొత్త మోసం..!

ఉద్యోగ వేటలో ఉన్న వారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. లింక్డ్ఇన్లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ‘జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి ‘Grass Call’ అనే వీడియో కాల్ యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. దీనిద్వారా సదరు వ్యక్తి ఫోన్, కంప్యూటర్లోని డేటా, బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారాన్ని తస్కరిస్తున్నారు’ అని వారు తెలిపారు.
News February 28, 2025
బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్-6లోని ఒకట్రెండు పథకాలు తప్ప మిగిలిన వాటి ఊసే లేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ‘ఈ బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలకు అన్యాయమే. ఆత్మ స్తుతి పర నిందగానే బడ్జెట్ సాగింది. జగన్ను తిట్టడం.. చంద్రబాబు, లోకేశ్ను పొగడడం తప్ప ఏమీ లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.