News January 28, 2025

POLITICAL: మాజీలకు మొండిచెయ్యి..!

image

ఉమ్మడి VZM జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వారితోపాటు తమ వర్గానికి టెకెట్ ఇవ్వలేదన్న కారణంతో ఎన్నికల్లో పలువురు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శలొచ్చాయి. వారిలో పార్వతీపురం, విజయనగరం, గజపతినగరం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలకు చెందిన నేతలు, మాజీలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఆ మాజీలకు అధిష్ఠానం మొండిచెయ్యి చూపిన సంగతి తెలిసిందే.

Similar News

News November 8, 2025

మండలానికి 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు: VZM కలెక్టర్

image

కూరగాయల పెంపకంపై దృష్టి పెట్టాలని, రైతులకు సుస్థిర లాభం వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి సూచించారు. ఉద్యాన, పశు సంవర్ధక, అటవీ, ఏపీఎంఐపీ శాఖలపై శుక్రవారం సమీక్ష జరిపారు. మండలానికి కనీసం 500 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్‌ మేరకు కూరగాయలు, పూల తోటలు, అరటి, బొప్పాయి, పుట్టగొడుగు సాగు పెంచాలని సూచించారు.

News November 7, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

News November 7, 2025

VZM: కంచం చేత పట్టి లైన్‌లో నిల్చున్న కలెక్టర్

image

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.