News January 28, 2025
POLITICAL: మాజీలకు మొండిచెయ్యి..!

ఉమ్మడి VZM జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వారితోపాటు తమ వర్గానికి టెకెట్ ఇవ్వలేదన్న కారణంతో ఎన్నికల్లో పలువురు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శలొచ్చాయి. వారిలో పార్వతీపురం, విజయనగరం, గజపతినగరం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలకు చెందిన నేతలు, మాజీలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఆ మాజీలకు అధిష్ఠానం మొండిచెయ్యి చూపిన సంగతి తెలిసిందే.
Similar News
News February 16, 2025
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.
News February 16, 2025
గద్వాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

గద్వాల పట్టణంలోని మొదటి రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. రైల్వే ఫ్లై ఓవర్ కింద ప్రమాదం జరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. వ్యక్తిని గుర్తించిన వారు గద్వాల రైల్వే పోలీస్ సెల్ 8341252529 నంబర్కు కాల్ చేయాలన్నారు.
News February 16, 2025
పెద్దగట్టు జాతర.. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

HYD నుంచి VJW, KMM వెళ్లే వాహనదారులకు SRPT పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన SRPT పెద్దగట్టు నేపథ్యంలో ఆయా రూట్లో వాహనాలను మళ్లిస్తున్నారు. జాతర నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు.